కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: సురేఖ ప్రేంసాగర్‌రావు

ABN , First Publish Date - 2022-01-26T04:10:38+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: సురేఖ ప్రేంసాగర్‌రావు
మాట్లాడుతున్న జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు

- డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు
బెల్లంపల్లి, జనవరి 25:  కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలాజీ మిని ఫంక్షన్‌ హాలులో నియోజకవర్గ స్ధాయి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదును నాయకులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్‌ నాయకులందరు కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మండల, గ్రామ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలు బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌, పార్టీ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌సీ, ఏఐసీసీ సభ్యుడు ప్రేంసాగర్‌రావు, నియోజకవర్గం లోని కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T04:10:38+05:30 IST