రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ
ABN , First Publish Date - 2022-07-04T06:08:45+05:30 IST
అన్నం పెట్టే రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, జూలై 3 : అన్నం పెట్టే రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో రచ్చబండ, , వరంగల్ రైతు డిక్లరేషన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రైతులతోపాటు అన్ని వర్గాలను ఆదరించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఏ పంట వేసుకోవాలో అన్న సందిగ్ధంలో పడిపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ తీరు అలా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ సెస్ చైర్మన్ జగన్రెడ్డి, చేపూరి గంగాధర్, జిల్లా నాయకులు కచ్చకాయల ఎల్లయ్య, గొట్టె రుక్మిణి, బండ సత్తయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు.