స్ర్టాంగ్‌ రూంను పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-02-27T05:38:28+05:30 IST

నగర పంచాయతీ ఎన్నికలు మార్చి 10న నిర్వహిం చనున్న నేపథ్యంలో స్థానిక జ్యోతిబాపూలే బాలికల కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూంను కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ శుక్రవారం పరిశీలించారు.

స్ర్టాంగ్‌ రూంను పరిశీలించిన కలెక్టర్‌
స్ర్టాంగ్‌రూం భవనాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

నెల్లిమర్ల, ఫిబ్రవరి 26: గర పంచాయతీ ఎన్నికలు మార్చి 10న నిర్వహిం చనున్న నేపథ్యంలో స్థానిక జ్యోతిబాపూలే బాలికల కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూంను కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ శుక్రవారం పరిశీలించారు. పోలింగ్‌ ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడు, తహసీల్దార్‌ జి.రాము, నగర పంచాయతీ జేఈ కిరణ్‌కుమార్‌, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. ఫ నెల్లిమర్లలో ఉన్న ఈవీఎం గోడౌన్లను కలెక్టర్‌ శుక్రవారం తనిఖీచేసి, రికార్డులో సంతకం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో గణపతిరావు, తహసీల్దార్‌ రాము, ఎన్నికల విభాగం డీటీ సూర్యకాంతం, ఆర్‌ఐ ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-02-27T05:38:28+05:30 IST