‘చింతామణి’ నిషేధంపై పునరాలోచించాలి
ABN , First Publish Date - 2022-01-26T04:59:32+05:30 IST
చింతామణి నాటకం నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి, కళాకారులను ఆదుకోవాలని ఆల్ ఇండియా కళారంగం కళాకారులు కోరారు.
ఇచ్ఛాపురం: చింతామణి నాటకం నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి, కళాకారులను ఆదుకోవాలని ఆల్ ఇండియా కళారంగం కళాకారులు కోరారు. మంగళవారం ఇచ్ఛాపురంలో తహసీల్దార్ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. కరోనా వల్ల రెండేళ్లుగా ఇబ్బందిపడ్డామని, ఈ తరుణంలో చింతామణి నాటకం నిషేధించటం సరికాదన్నారు. కార్యక్రమంలో కళాకారులు ధనంజయరెడ్డి, చిన్నాగురుస్వామి పాల్గొన్నారు.