‘కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి’

ABN , First Publish Date - 2020-05-23T09:39:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని శుక్రవారం జిల్లాలోని వివిధ చోట్ల కార్మికులు నిరసన

‘కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి’

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ / పాలమూరు / బాదేపల్లి, మే 22 : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని శుక్రవారం జిల్లాలోని వివిధ చోట్ల కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మహబూబ్‌నగర్‌లోని సీఐటీయూ కార్యాలయ ఆవరణలో ధర్నా చేశారు. బాదేపల్లిలోలని సీఐటీయూ కార్యాలయంలోనూ నిరసన చేపట్టారు.


ఆయా కార్యక్రమాల్లో వివిధ సంఘాల నాయకులు మట్టగల్ల వెంకటయ్య, ఖమర్‌అలీ, ఎర్రం నర్సింహులు, బాలరాజు, ప్రభాకర్‌, పి.విశ్వనాథం, కె.కేశవులు, బాలయ్య, అంజి, పార్వతమ్మ, సిరాజ్‌, జి.శ్రీను, యాదయ్య, శంకరమ్మ, బీమమ్మ, చెన్నయ్య, చెన్నమ్మ, వెంకటమ్మ, పార్వతయ్య, జగన్‌, సరోజ, రాజలక్ష్మి, నసియాబేగం, విజయలక్ష్మి, నర్సింహులు, శంకర్‌యాదవ్‌, సత్తయ్య, ఆంజనేయులులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T09:39:30+05:30 IST