అదుపు తప్పిన చెట్టును ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2021-03-07T05:49:14+05:30 IST

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం భూపతి పూర్‌, గర్రెపల్లి రాజీవ్‌రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు.

అదుపు తప్పిన చెట్టును ఢీకొట్టిన కారు
ధ్వంసమైన కారు

- ఒకరు మృతి, మరొకరు కోమాలో  

- మరో ఇద్దరికి తీవ్రగాయాలు

- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఘటన

సుల్తానాబాద్‌, మార్చి 6: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌  మండలం భూపతి పూర్‌, గర్రెపల్లి రాజీవ్‌రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. సుల్తానాబాద్‌ ఎస్సై ఉపేందర్‌ రావు కథనం ప్రకారం.. జిల్లాకు చెందిన ఐదు గురు సభ్యులు గల బృందం వరంగల్‌లో జరిగే సమావేశానికి కారులో బయలు దేరింది. అనంతరం తిరిగి ఆసిఫాబాద్‌ వస్తుండగా సుల్తానాబాద్‌ మండలం భూపతిపూర్‌-గర్రెపల్లి గ్రామాల మధ్యలో శుక్రవారం అర్ధరాత్రి వీరి కారుకి కుక్క అడ్డువచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. ఈసంఘటనలో కారులో ఉన్న జాటోతు రవిందర్‌(37) అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో నలు గురు బడావత్‌ శేఖర్‌, దుర్గం శేఖర్‌, బొమ్మన సంతోష్‌, డ్రైవర్‌ నాచర్ల హరీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ అస్పత్రికి తరలించారు. రవీందర్‌ ఆసిఫాబాద్‌ టీఎస్‌ఎన్‌డీసీఎల్‌ విద్యుత్‌ శాఖలో ఎలక్ర్ట్రీషి యన్‌గా పనిచేస్తున్నాడు. విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం వారి సమావేశం కోసం వీరుకారులో వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి తండ్రి జాటోతు మోతీలాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-03-07T05:49:14+05:30 IST