డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు

ABN , First Publish Date - 2021-01-27T05:57:12+05:30 IST

ఇచ్ఛాపురం టోల్‌ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు
ప్రమాదంలో నుజ్జయిన బస్సు ముందు భాగం




12 మందికి గాయాలు
ఇచ్ఛాపురం టోల్‌ప్లాజా సమీపంలో ఘటన
ఇచ్ఛాపురం, జనవరి 26 :
ఇచ్ఛాపురం టోల్‌ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది.  ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నుంచి భువనేశ్వర్‌ వైపు 19 మంది ప్రయాణికులతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వెళ్తోంది. ఇచ్ఛాపురం టోల్‌ప్లాజా సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వేకువజాము కావడంతో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టడంతో భారీ శబ్ధం వచ్చింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజాము కావడంతో క్షతగాత్రులు రోడ్డుపై చలిలో హాహాకారాలు చేస్తూ గడిపారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం బరంపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఒడిశా వాసులే. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.


Updated Date - 2021-01-27T05:57:12+05:30 IST