విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

ABN , First Publish Date - 2021-10-20T04:59:10+05:30 IST

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
ఎద్దు కళేబరం వద్ద రైతు లక్ష్మయ్య

కేశంపేట: కాకూనూర్‌లో కరెంట్‌ షాక్‌కు గురై ఎద్దు మృ త్యువా త పడింది. ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో మేత మేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై గ్రామానికి చెందిన సొంటె లక్ష్మయ్య ఎద్దు మృత్యువాత పడింది. దీని విలువ రూ.60వేలు ఉంటుందని రైతు తెలిపాడు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ఆ రైతు ఎద్దు మృతితో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని లక్ష్మయ్య అధికారులను వేడుకుంటున్నాడు.

Updated Date - 2021-10-20T04:59:10+05:30 IST