ప్రకాశం పంతులు తెగువ మరువలేనిది
ABN , First Publish Date - 2022-05-21T04:53:57+05:30 IST
ప్రకాశం పంతులు తెగువ ప్రతి ఆంధ్రుడు మరువలేనిదని ఎమ్మెల్యే మధుసూదన్యాదవ్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశంపంతులు చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత ఆంధ్రకేసరి తెగువ, తెగింపును అలవర్చుకోవాలన్నారు.
- ఎమ్మెల్యే మధుసూదన్యాదవ్
కనిగిరి, మే 20: ప్రకాశం పంతులు తెగువ ప్రతి ఆంధ్రుడు మరువలేనిదని ఎమ్మెల్యే మధుసూదన్యాదవ్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశంపంతులు చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత ఆంధ్రకేసరి తెగువ, తెగింపును అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దంతులూరి ప్రకాశం, జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వైఎం సరిత, సింగిల్ విండో చైర్మన్ సూరసాని మోహన్రెడ్డి, నగరపంచాయతీ వైస్చైర్మన్ మాణిక్యరావు, రంగనాయకులరెడ్డి, కౌన్సిలర్లు తమ్మినేని సుజాత, వేల్పుల వెంకటేశ్వర్లుయాదవ్, నాయకులు రామనబోయిన శ్రీనివాసులయాదవ్, దాసరి మురళీయాదవ్, శ్రీహరిరెడ్డి, సంగు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.