గోస్తనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-03-07T06:47:06+05:30 IST

చిట్టివలస నుంచి మూలకుద్దు వెళ్లే మార్గంలో గోస్తనీ నది వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది.

గోస్తనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
మహిళ మృతదేహం

తగరపువలస, మార్చి 6: చిట్టివలస నుంచి మూలకుద్దు వెళ్లే మార్గంలో గోస్తనీ నది వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది. స్థానికులు ఈ మేరకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. 60 ఏళ్ల వయసు గల వృద్ధురాలు పసుపురంగు చీరు ధరించి ఉందని, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ప్రమాదవశాత్తు గోస్తనీలో పడి మృతి చెందిందా అన్న విషయం తేలాల్సి ఉందన్నారు. ఈ వంతెన అవతల ప్రాంతం విజయనగరం జిల్లాకు చెందినది కావడం వల్ల అక్కడి పరిసర గ్రామాలకు చెందిన మహిళగా భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-07T06:47:06+05:30 IST