గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-05-19T06:27:52+05:30 IST

మండల పరిధిలోని పీ కొత్తపల్లి పంచాయతీ ఆవులచెరువు సమీపంలో ఉన్న ఎనుములకొండలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెంది ఉం డటాన్ని పశువుల కాపరులు గుర్తించారు

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నల్లచెరువు, మే 18: మండల పరిధిలోని పీ కొత్తపల్లి పంచాయతీ ఆవులచెరువు సమీపంలో ఉన్న ఎనుములకొండలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెంది ఉం డటాన్ని పశువుల కాపరులు గుర్తించారు. ఈ విషయాన్ని మంగళవారం నల్లచెరువు ఎస్‌ఐ మునీర్‌అహమ్మద్‌కు తెలిపారు. ఎస్‌ఐ మునీర్‌ అహమ్మద్‌, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ 10 రోజుల క్రితమే ఆత్మహ త్యకు పాల్పడి ఉంటాడని మృతదేహం పూర్తిగా కుళ్లి పోయిందన్నారు. మృతుడు తెల్లషర్టు, తెల్లపంచ ధరించి ఉన్నాడని, ఆ పంచెతోనే ఉరివేసుకున్నట్లు తెలిపారు.  కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 



Updated Date - 2021-05-19T06:27:52+05:30 IST