బీజేపీని బలోపేతం చేయాలి
ABN , First Publish Date - 2022-01-19T04:40:51+05:30 IST
రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కార్యక్తలకు సూచించారు.
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
- 60మంది యువకులు బీజేపీలో చేరిక
మరికల్, జనవరి 18 : రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కార్యక్తలకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు పల్లెగడ్డ, ఎల్లిగండ్ల గ్రామాలకు చెందిన 60మంది యువకులు మండల కేంద్రంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో బీజే పీలో చేరారు. ఈ సందర్భంగా డీకే అరుణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. కేంద్రంలో మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలకు యువకులు ఆకర్షితులై పార్టీలో చేరారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరుగుతోందని, నిధులు కేంద్రంవి, గొప్పలు చెప్పుకోవడం, పత్రికలో ఫొటోలు వేసుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానివి అన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, రతంగ్పాండురెడ్డి, చిన్న నర్సన్గౌడ్, తిరుపతిరెడ్డి, భాస్కర్రెడ్డి, వేణు, రమేష్, వెంకటేష్, శ్రీరామ్ పాల్గొన్నారు.