సుస్థిర పాలనతోనే బీజేపీకి ఆదరణ
ABN , First Publish Date - 2020-05-21T09:35:12+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ దేశానికి సుస్థిర పాలన అందిస్తున్న బీజేపీకి ప్రజల్లో ఆధరణ పెరుగుతోందని
మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి
బంజారాహిల్స్, మే 20(ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ దేశానికి సుస్థిర పాలన అందిస్తున్న బీజేపీకి ప్రజల్లో ఆధరణ పెరుగుతోందని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఫిలింనగర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వెల్దండ వెంకటేష్ తన అనుచరులతో కలిసి బుధవారం సాగర్సొసైటీలోని పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరారు. చింత ల రామచంద్రారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెల్దండ వెంకటేష్ మాట్లాడుతూ బీజేపీ విధానాలు నచ్చి పార్టీలో చేరినట్టు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో రాజ్కుమార్, కురుమూర్తి, వెంకటయ్య, మహేష్ తదితరులున్నారు.