ఈటలపై ఆరోపణలు కుట్రలో భాగమే
ABN , First Publish Date - 2021-05-07T06:05:29+05:30 IST
కుట్రలో భాగంగానే సీఎం కేసీఆర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ముది రాజ్ మహాసేన నేతలు ఆరోపించారు. గురువారం మండలంలోని సోనాలలో ముదిరాజ్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
బోథ్ రూరల్, మే 6: కుట్రలో భాగంగానే సీఎం కేసీఆర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ముది రాజ్ మహాసేన నేతలు ఆరోపించారు. గురువారం మండలంలోని సోనాలలో ముదిరాజ్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యామ్నాయం ఈటల రాజేందర్ అని అందుకే ఆయనపై భూకబ్జా ఆరోపణలు చేసి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని విమర్శించారు. ఈటల బర్తరఫ్ సీఎం పతనానికి నాంది అని, కేవలం తనను ప్రశ్నిస్తున్నాడనే కారణంతోనే ఈటలను తప్పించారని రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కుట్రలు సాగనివ్వమని ముదిరాజ్ సంఘం నేతలు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసేన రాష్ట్ర ఉపాధ్యాక్షులు బొజ్జ నారయణ, జిల్లా ఉపాధ్యాక్షులు మందుల రమేష్, నాయకులు శివయ్య, పాండురంగ, చిన్నయ్య, సున్నపు శ్రీనివాస్ పాల్గొన్నారు.