నిందితులను కఠినంగా శిక్షించాలి : టీడీపీ

ABN , First Publish Date - 2020-07-05T11:13:10+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆంగోతు విజయనాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి : టీడీపీ

దేవరకొండ / నల్లగొండ, జూలై 4 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆంగోతు విజయనాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయ అధికారి అయూబ్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు కోట్ల జగదీష్‌, గార్లపాటి శ్రీనివాస్‌, గౌస్‌ మైనొద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థిని హత్య చేసిన నిందితులను గుర్తించి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుతో విచారించి శిక్షించాలని టీడీపీ నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాఽధ్యక్షులు ధీరావత్‌ మాన్యానాయక్‌, జిల్లా నాయకులు మాలోతు గోవి ంద్‌, సైదానాయక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్‌కు వినతిపత్రం అం దించిన అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

Updated Date - 2020-07-05T11:13:10+05:30 IST