రైతులతో చర్చించే ప్రసక్తే లేదనటం దారుణం: కొల్లా

ABN , First Publish Date - 2021-08-30T15:23:45+05:30 IST

రాజధాని విషయంలో..

రైతులతో చర్చించే ప్రసక్తే లేదనటం దారుణం: కొల్లా

బాపట్ల టౌన్‌: రాజధాని విషయంలో అమరావతిరైతులతో చర్చించే ప్రసక్తే లేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడం రాజకీయకక్షతో వ్యవహరించే దృష్టచర్య అని సంగం డెయిరీ మాజీ చైర్మన్‌ కొల్లా వీరయ్యచౌదరి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విన్నపాన్ని మన్నించి రాజధాని నిర్మాణం కోసం తమ ప్రాణప్రదమైన పంట భూములను త్యాగంచేసిన 29 గ్రామాల అన్నదాతలు 620 రోజులుగా దీక్షలు చేస్తుంటే వారితో చర్చించే ప్రసక్తే లేదనటం దారణమైన చర్య అని కొల్లా విమర్శించారు.

Updated Date - 2021-08-30T15:23:45+05:30 IST