ఆ బిల్లును రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-10-02T09:16:32+05:30 IST
వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు గుబ్బల రమేష్ ..
రాజోలు, అక్టోబరు 1: వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు గుబ్బల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రాజోలులో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పీతల రామచంద్రరావు, బుంగ సత్యనారాయణ, బళ్ల పర్వతాలు, చెల్లుబోయిన కేశవశెట్టి, జంపన ప్రసాదరావు పాల్గొన్నారు.