jk Shopian: సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్ర దాడి..జవానుకు గాయాలు
ABN , First Publish Date - 2021-08-10T14:27:49+05:30 IST
జమ్మూ కశ్మీరులోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒకరు...
శ్రీనగర్ : జమ్మూ కశ్మీరులోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒకరు గాయపడ్డారు. దక్షిణ కశ్మీరులోని షోపియాన్ జిల్లా జైనాపొరాలోని క్రాచెక్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు గాలిస్తుండగా నలుగురు ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పారామిలటరీ దళానికి చెందిన అజయ్ కుమార్ అనే జవానుకు బుల్లెట్ గాయమైంది. గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.చేతికి బుల్లెట్ గాయమైన జవాన్ అజయ్ కుమార్ చికిత్స అనంతరం కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.
ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత సీఆర్పీఎఫ్ జవాన్లు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. పారామిలటరీ దళాలతో క్రాచెక్ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఘటన స్థలంలో జవాన్లకు తూటాలు లభించాయి. రెండు రోజుల పర్యటన కోసం కశ్మీర్ వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాతా ఖీర్ భవానీ దేవాలయం, హజ్రత్ బల్ పుణ్యస్థలాలను సందర్శించనున్నారు.