ఉండవల్లిలో Chandra Babu నివాసం వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-06-25T22:01:58+05:30 IST
అమరావతి: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మూడు సంవత్సరాల క్రితం
అమరావతి: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజు (జూన్25)న ప్రస్తుత జగన్ ప్రభుత్వం ప్రజా వేదికను అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేయించింది. దీనిపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా వేదిక కూల్చివేతకు నిరసనగా.. టీడీపీ శ్రేణులు ఉండవల్లికి వస్తాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరికాసేపట్లో ప్రజావేదిక వద్దకు కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు, తెలుగు యువత నాయకులు రానున్నట్లు సమాచారం.
అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసమే ప్రజావేదిక
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ప్రజా వేదికను నిర్మించారు.చంద్రబాబు ఇంటి పక్కనే ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం దీని నిర్మాణం జరిగింది. ఇదే ప్రజావేదికలో సీఎం జగన్ చివరి సారిగా కలెక్టర్ల సమావేశం నిర్వహించి.. ఐఏఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిర్వాకం వల్లే ఇలాంటి నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సమావేశం ముగియగానే ప్రజావేదిక కూల్చివేతకు అక్కడే ఆదేశాలు ఇచ్చారు.