‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-06-05T10:26:14+05:30 IST
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ నాగార్జునరావు
అచ్చంపేట అర్బన్, జూన్ 4 : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ నాగార్జునరావు అన్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గురుకుల పాఠశాలను గురువారం ఆయన తనఖీ చేసి మాట్లాడారు. పరీక్షా కేంద్రంలో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మొగులయ్య, బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు.