మరమ్మతుల్లో మర్మం

ABN , First Publish Date - 2021-02-27T05:11:29+05:30 IST

ఇంకో నాలుగు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కి వెళ్తాయి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ మంజూరు చేయించడమంటే కత్తి మీద సామే.. రోడ్డు గుంతల్లో కాసింత తారు, గుప్పెడు చిప్స్‌ పోసేస్తే సరి...! ఎంచక్కా నిధులు డ్రా చేసుకోవచ్చు...

మరమ్మతుల్లో మర్మం


ఇంకో నాలుగు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కి వెళ్తాయి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ మంజూరు చేయించడమంటే కత్తి మీద సామే.. రోడ్డు గుంతల్లో కాసింత తారు, గుప్పెడు చిప్స్‌ పోసేస్తే సరి...! ఎంచక్కా నిధులు డ్రా చేసుకోవచ్చు... ఇదీ టంగుటూరు-పొదిలి రహదారి నిర్వహణ పనుల తీరు. రోడ్డు మరమ్మతులు అత్యంత నాసిరకంగా కొనసాగుతున్నాయి. మర్రిపూడి, రేగలగడ్డ గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారి గోతులమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆ గోతులకు రెండు రోజుల నుంచి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై పేలికలు పేలికలుగా ప్యాచ్‌వర్క్‌ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అంతేగాక రోడ్డుకిరువైపులా అంచులు సైతం కోసుకుపోయినా పట్టించుకోవడంలేదు. అధికారుల పర్యవేక్షణ అసలు లేకపోవడంతో మరమ్మతులు మమ అనిపిస్తున్నారు. ఎలాగైనా నిధులు ఖర్చుపెట్టాలన్నా ఉద్దేశంతో పనులు చేయిస్తున్నారు.  - మర్రిపూడి

Updated Date - 2021-02-27T05:11:29+05:30 IST