ఆలయ ఏనుగుకు పాదరక్షలు
ABN , First Publish Date - 2022-07-03T18:02:45+05:30 IST
నెల్లయప్పర్ ఆలయ ఏనుగుకు ఓ భక్తుడు పాదరక్షలు విరాళంగా అందజేశారు. తిరునల్వేలిలోని అరుళ్మిగు నెల్లయప్పర్ గాంధీమతి అమ్మన్ ఆలయానికి
పెరంబూర్(చెన్నై), జూలై 2: నెల్లయప్పర్ ఆలయ ఏనుగుకు ఓ భక్తుడు పాదరక్షలు విరాళంగా అందజేశారు. తిరునల్వేలిలోని అరుళ్మిగు నెల్లయప్పర్ గాంధీమతి అమ్మన్ ఆలయానికి సొంతమైన ‘గాంధీమతి’ అనే ఏనుగు ఉంది. చక్కెర వ్యాధితో బాధపడుతున్న ఆ ఏనుగు నడిచే సమయంలో పాదాలకు నొప్పి లేకుండా, మోకాలి నుంచి పాదాల వరకు తోలుతో చేసిన రూ.12 వేల విలువైన పాదరక్షలను భక్తులు అందజేశారు. ఆలయ ఏనుగుకు భక్తులు పాదరక్షలు విరాళంగా ఇవ్వడం రాష్ట్రంలో ఇదే తొలిసారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.