కశ్మీర్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
ABN , First Publish Date - 2020-08-08T08:31:44+05:30 IST
వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి జమ్మూ కశ్మీర్లో 6.9 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇది ప్రపంచ, జాతీయ ఉష్ణోగ్రతలలో అంచనా వేసిన సగటు కంటే ఎక్కువ...
శ్రీనగర్, ఆగస్టు 7: వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి జమ్మూ కశ్మీర్లో 6.9 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇది ప్రపంచ, జాతీయ ఉష్ణోగ్రతలలో అంచనా వేసిన సగటు కంటే ఎక్కువ. అంతేకాదు ఈ ప్రాంతంలోని హిమానీ నదాలు 85 శాతం వరకూ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నదని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.