ఆత్మీయ సమావేశానికి తరలిన తెలుగు తమ్ముళ్లు
ABN , First Publish Date - 2021-10-20T06:09:06+05:30 IST
గార్లదిన్నెలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి శింగనమల మండల నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.
శింగనమల, అక్టోబరు 19: గార్లదిన్నెలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి శింగనమల మండల నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ముందుగా శింగనమల మసూద్ వలిస్వామి దర్గా నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గార్లదిన్నెకు 130 వాహనాల్లో బయలుదేరారు. కార్యక్రమంలో నాయకులు మారుతినాయుడు, దాసరి గంగాదర్, నాగముని, వెంకటేష్, అనంతపురం పార్లమెంట్ కోశాధికారి శ్రీనివాసగౌడ్, మాజీ ఎంపీటీసీ కుళ్లాయప్ప, చెండ్రాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీఎనఎస్ఎఫ్ బండి పరశురాం, సుదర్శన, చిన్నఆదెప్ప, కోటిరెడ్డి, అనిల్, బాలరాజు, శీనా తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలోకి చేరిక
శింగనమల మండలంలోని కొరివిపల్లినికి చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. కొరివిపల్లికి చెందిన కుమ్మర ఆదెప్ప, గొల్లక్రిష్ణా, శేషయ్య, కేశవతో పాటూ మొత్తం 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. టీడీపీ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాసులు వారికి టీడీపీ శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుళ్లాయప్ప, పార్లమెంట్ జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, అనిల్, సుదర్శనస్వామి, పెద్దనాగముని, వెంకటేష్, విజయ, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.