తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థులు క్వారంటైన్కు తరలింపు
ABN , First Publish Date - 2020-03-29T10:22:43+05:30 IST
తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు పోటీ పరీక్షల శిక్షణ నిమిత్తం వెళ్లిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన విద్యార్థులను అధికారులు శనివారం విశాఖకు ప్రత్యేక బస్సులో తీసుకువచ్చారు.
అక్కిరెడ్డిపాలెం: తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు పోటీ పరీక్షల శిక్షణ నిమిత్తం వెళ్లిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన విద్యార్థులను అధికారులు శనివారం విశాఖకు ప్రత్యేక బస్సులో తీసుకువచ్చారు. వీరిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన విద్యార్థులను వారి జిల్లాలకు తరలించగా, విశాఖకు చెందిన 28 మంది విద్యార్థులను షీలానగర్లోని వికాశ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా నెగిటివ్ అని తేలితే ఇళ్లకు పంపించేస్తామని అధికారులు తెలిపారు.