పీకే ఎంట్రీతో ఆసక్తిగా మారిన తెలంగాణ రాజకీయం

ABN , First Publish Date - 2022-03-02T17:26:14+05:30 IST

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.

పీకే ఎంట్రీతో ఆసక్తిగా మారిన తెలంగాణ రాజకీయం

హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. రానున్న రోజుల్లో పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం రణరంగంగా మారిపోనుంది. అయితే పీకేను కమలనాథులు లైట్ తీసుకుంటున్నారా? పీకేలతో బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదని కమలనాథుల మాటల్లో ఆంతర్యమేమిటి?


వేసవి కంటే ముందే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న బీజేపీ.. తమ బలాన్ని పెంచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేందుకు యత్నిస్తోంది. ఇక అధికారాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్, పీకేను రంగంలోకి దింపింది. దీంతో బీజేపీ సయితం ఏ మాత్రం వెనక్కి తగ్గేదిలేదంటూ తమ ప్రయత్నాలు తాను చేసుకుపోతోంది. సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పార్టీ పనులు చక్కబెట్టే పనిలోపడ్డారు.

Updated Date - 2022-03-02T17:26:14+05:30 IST