587 సీసాల తెలంగాణ మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-09-29T05:41:12+05:30 IST
కారులో తెలంగాణ నుంచి తరలిస్తున్న 587 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఇన్చార్జ్ సీఐ జె.రామ్ప్రకాష్ తెలిపారు.
జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 28: కారులో తెలంగాణ నుంచి తరలిస్తున్న 587 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఇన్చార్జ్ సీఐ జె.రామ్ప్రకాష్ తెలిపారు. తాడువాయి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పి.శ్రీనివాసరావు, రెడ్డి భీమరాజు కారులో మద్యం తరలించడం గుర్తించారు. కారును సీజ్ చేసి వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు.