తెలంగాణ మద్యం స్వాధీనం.. ఆటో సీజ్
ABN , First Publish Date - 2021-10-22T05:35:09+05:30 IST
కృష్ణానది మీదగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 785 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
బెల్లంకొండ, అక్టోబరు 21: కృష్ణానది మీదగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 785 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. గురువారం తెల్లవారుజామున మన్నెసుల్తానపాలెం గ్రామం వద్ద తనిఖీలు చేపట్టగా ఆటోలో మద్యం గుర్తించినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులు ఆటో వదిలి పరారవడంతో మద్యం స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశామన్నారు. దాడుల్లో ఏఎస్ఐ బెన్హరి, హెడ్ కానిస్టేబుల్ హుస్సేన, సిబ్బంది నాగబాబు, హనుమంతురావు, నారాయణ, సత్యం, తదితరులు పాల్గొన్నారు.