అనారోగ్యంతో తహసీల్దార్‌ మృతి

ABN , First Publish Date - 2020-07-12T09:53:42+05:30 IST

కన్నెపల్లి తహసీల్దార్‌ మేకల మల్లేష్‌ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

అనారోగ్యంతో తహసీల్దార్‌ మృతి

కన్నెపల్లి, జూలై 11: కన్నెపల్లి తహసీల్దార్‌ మేకల మల్లేష్‌ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారం రోజులుగా ఆయన నిమోనియాతో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. నాలుగు రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందినట్లు భీమిని పీహెచ్‌సీ వైద్యుడు శ్రీనివాస్‌ తెలిపారు. మల్లేష్‌ ఎనిమిది నెలల క్రితం భూపాలపల్లి జిల్లా నుంచి కన్నెపల్లికి బదిలీపై వచ్చారు.

Updated Date - 2020-07-12T09:53:42+05:30 IST