Uttar pradeshలో దారుణం.. భార్య పక్కన ఉండగానే బాలికపై అత్యాచారం చేసిన భర్త.. చివరకు..

ABN , First Publish Date - 2022-07-17T01:49:51+05:30 IST

కొంత మంది మహిళలు పురుషులను మించిన క్రూరత్వం ప్రదర్శిస్తారు. మగవారి కంటే కర్కశంగా ప్రవర్తిస్తారు

Uttar pradeshలో దారుణం.. భార్య పక్కన ఉండగానే బాలికపై అత్యాచారం చేసిన భర్త.. చివరకు..

కొంత మంది మహిళలు పురుషులను మించిన క్రూరత్వం ప్రదర్శిస్తారు. మగవారి కంటే కర్కశంగా ప్రవర్తిస్తారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ అలాగే ప్రవర్తించింది. తమ పక్కింటి బాలికను ఇంట్లోకి పిలిచి భర్త చేత అత్యాచారం చేయించింది. ఆ బాలికపై భర్త అత్యాచారం చేస్తుండగా ఆ ఘటనను మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించింది. దానిని చూపించి ఆ బాలికను బెదిరించడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ఆ మహిళ చివరకు తనపై జరిగిన అకృత్యం గురించి తల్లిదండ్రులకు చెప్పేసింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


ఇది కూడా చదవండి..

ప్రియుడి కోసం పెద్దలను ఎదురించి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి.. చివరకు ఆమె పరిస్థితి ఏంటంటే..


యూపీలోని బదౌన్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన దంపతుల ఇంటికి పొరుగింటి బాలిక తరచుగా వెళ్తుండేది. ఆ క్రమంలో ఆ బాలికపై ఆ వ్యక్తి కన్ను పడింది. ఆ బాలికను అత్యాచారం చేయాలనుకున్నాడు. ఆ విషయం భార్యకు చెప్పి ఈ నెల 12వ తేదీన ఆ బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెను గదిలో బంధించి అత్యాచారం చేశాడు. ఆ బాలికను భర్త అత్యాచారం చేస్తుండగా భార్య పక్కనే ఉండి రికార్డు చేసింది. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని ఇద్దరూ ఆ బాలికను బెదిరించారు. 


బాలిక తన ఇంటికి వెళ్లి ఎవరికీ ఆ ఘటన గురించి చెప్పలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోను నిందిత మహిళ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేసింది. దీంతో బాలిక తీవ్రంగా భయపడింది. కూతురి ప్రవర్తనలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన దారుణం బయట పడింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేశారు. బాలికను మెడికల్ టెస్ట్‌ల కోసం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-07-17T01:49:51+05:30 IST