జీవో 117, 128 రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST
తమ న్యాయమైన సమస్యలు పరిష్క రించాలని తక్షణం జీవో నెంబర్ 117, 128లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.
ఏలూరు కలెక్టరేట్, ఆగస్టు 10: తమ న్యాయమైన సమస్యలు పరిష్క రించాలని తక్షణం జీవో నెంబర్ 117, 128లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. అధ్యక్షుడు పీబీఎన్ఎల్ నారాయణ, ప్రధాన కార్యదర్శి టీఎస్ ప్రకాష్ మాట్లాడుతూ పెన్షనరీ బెనిఫిట్స్, డీఏ, పీఎఫ్, సరెండర్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై నాటికి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చినా నేటికి నెరవేరలేదని మండిపడ్డారు. అనంతరం డీఆర్వో సత్యనారాయణ మూర్తిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.