రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం సంక్షోభంలో నెట్టింది: అచ్చెన్నా
ABN , First Publish Date - 2020-10-22T23:11:18+05:30 IST
రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం సంక్షోభంలో నెట్టింది: అచ్చెన్నా
అమరావతి: ఎడమ చేతితో ఇచ్చి కుడి చేతితో రెట్టింపు గుంజుకోవడమే జగన్రెడ్డి సంక్షేమమని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. మోటారు వాహన చట్టంలో సవరణలు తీసుకొచ్చి కోటి 31 లక్షల మంది వాహనదారులపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం సంక్షోభంలో నెట్టడం దుర్మార్గమన్నారు. 16 నెలల్లో కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదన్నారు. కమీషన్ల కోసం కాంట్రాక్టులు ధారాదత్తం చేయడంపై ఉన్న శ్రద్ధ రహదారుల అభివృద్ధిపై చూపడం లేదన్నారు.