టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వీఎస్ ముక్తియార్
ABN , First Publish Date - 2021-10-17T05:08:35+05:30 IST
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ వీఎస్ ముక్తియార్ను పార్టీ అధిష్ఠానం తిరిగి ఎంపిక చేసింది.
ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 16 : టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ వీఎస్ ముక్తియార్ను పార్టీ అధిష్ఠానం తిరిగి ఎంపిక చేసింది. ఈ మేరకు టీడీపీ అధిష్టానం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వీఎస్ ముక్తియార్ ఎంపిక పట్ల మరో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కెసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు రెడ్యం చంద్రశేఖర్రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. ఆమేరకు వారు ముక్తియార్ను అభినందిస్తూ సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ కడప పార్లమెంట్ కార్యదర్శి సిద్దయ్య, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.