రహదారుల అధ్వానంపై టీడీపీ నిరసనలు
ABN , First Publish Date - 2021-07-25T06:29:50+05:30 IST
జగన పరిపాలన అడుగడుగునా అవినీతి సంత, రహదారిలో అడుగుకో గుంత కార్యక్రమాన్ని శనివారం టీడీపీ కదిరి నియోజకవర్గ ఇనచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
కదిరి, జూలై 24: జగన పరిపాలన అడుగడుగునా అవినీతి సంత, రహదారిలో అడుగుకో గుంత కార్యక్రమాన్ని శనివారం టీడీపీ కదిరి నియోజకవర్గ ఇనచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కుమ్మరవాండ్లపల్లి పెట్రోల్ బంక్ నుంచి ముస్టిపల్లికి వెళ్ళే రోడ్డు వరకు అడుగడుగుకో గుంత అన్న నినాదంతో సాగించారు. అధ్వానంగా తయారైన రోడ్డులో వరినాట్లు వేస్తూ తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఈ కా ర్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు మోపూరిశెట్టి చంద్రశేఖర్, తె లుగుయువత జిల్లా అధ్యక్షులు బాబ్జాన, పార్లమెంట్ కార్యదర్శి సులేమాన, ఎస్సీసెల్ నాయకులు రాజశేఖర్బాబు, మండల కన్వీనర్ చెన్నకేశవులు, గంగులప్ప, ప్రసాద్, డైమండ్ ఇర్ఫాన, శంకర, మహిధర్రెడ్డి, గంగన్న, విశ్వ, వడ్డెబాబు, మహేంద్ర, మనోహర్గౌడ్, ఇమ్రాన, బాబావలి, షానవాజ్, చౌదరి, శివా, రాజేంద్రనాయుడు, హరి, నూర్, మహిళా సంఘం నాయ కురాలు పీట్ల రమణమ్మ, నిర్మలమ్మ, గంగరత్నమ్మ, ఉమాదేవీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.