మహిళలపై హత్యలు, అత్యాచారాలను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-05-24T05:34:44+05:30 IST

మహిళలపై హత్యలు, ఆత్యాచా రాలను అరికట్టాలని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు శిరి గినీడి రాజ్యలక్ష్మి అన్నారు.

మహిళలపై హత్యలు, అత్యాచారాలను అరికట్టాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న మహిళలు

పాలకొల్లు అర్బన్‌, మే 23: మహిళలపై హత్యలు, ఆత్యాచా రాలను అరికట్టాలని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు శిరి గినీడి రాజ్యలక్ష్మి అన్నారు. పార్టీ కార్యా లయంలో నియోజకవర్గ తెలుగు మహిళ సమావేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయు డు అధ్యక్షతన సోమవారం జరి గింది. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ నిత్యం మహిళలపై దాడులు, హత్యలు జరు గుతున్నాయన్నారు. అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమవు తున్నారని ఆరోపించారు. అనంతరం తెలుగు మహిళలతో కలిసి పాదయా త్రగా వెళ్లి తహసీల్దార్‌ జి.మమ్మికి వినతిపత్రం అందజేశారు. బత్తుల మేరీ నిర్మలకుమారి, పెండ్యాల భవాని, బీరా వెంకటరమణ, ఎస్తేరు రాణి, ద్రాక్షారపు జ్యోతి, వి.విజయలక్ష్మి, తాళ్ళూరి వరలక్ష్మి, బి.మల్లేశ్వరి, కె.వరలక్ష్మి, మణిరత్నం, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:34:44+05:30 IST