పార్టీ బలోపేతంపై దృష్టి సారించండి
ABN , First Publish Date - 2020-08-09T06:44:07+05:30 IST
జిల్లాలో పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు...
- టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
నల్లగొండ, ఆగస్టు 8 : జిల్లాలో పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఆయన జూమ్ యాప్ ద్వారా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే రోజుల్లో పార్టీ గ్రామస్థాయి నుంచి బలోపేతానికి సన్నద్ధం కావాలని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ వాణిజ్య సెల్ అధ్యక్షుడు కూరెళ్ల విజయ్కుమార్, పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.