ఆ ఇద్దరే దుర్గుగుడిలో అవినీతికి ప్రధానకారకులు: కేశినేని నాని

ABN , First Publish Date - 2021-02-23T18:17:26+05:30 IST

దుర్గగుడిలో చిరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయటం సరికాదని ఎంపీ కేశినేనా నాని అన్నారు. దుర్గుగుడిలో జరిగిన అవకతవకలు అవినీతికి ప్రధాన కారకులు మంత్రి వెల్లంపల్లి, ఈఓ సురేష్‌ బుబు అని ఆరోపించారు.

ఆ ఇద్దరే దుర్గుగుడిలో అవినీతికి ప్రధానకారకులు: కేశినేని నాని

విజయవాడ: దుర్గగుడిలో చిరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయటం సరికాదని ఎంపీ కేశినేనా నాని అన్నారు. దుర్గుగుడిలో జరిగిన అవకతవకలు అవినీతికి  ప్రధాన కారకులు మంత్రి వెల్లంపల్లి, ఈఓ సురేష్‌ బుబు అని ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉందని...మంత్రి వెల్లంపల్లి గుడులు, దేవాలయాలను దోచుకుంటున్నారని...మూడు రోజులు జరిగిన ఏసీబీ దాడుల్లో అది రుజువైందని అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తాను నిధులు తెప్పించుకుని విజయవాడను అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలపై పన్నులు వేయటానికే తప్ప అభివృద్ధి మాత్రం వైసీపీ పట్టించుకోవటం లేదని కేశినేని నాని విమర్శించారు. 

Updated Date - 2021-02-23T18:17:26+05:30 IST