23న టీడీపీ మినీ మహానాడు
ABN , First Publish Date - 2022-05-15T06:53:59+05:30 IST
ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు నిర్వహించనున్నామని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్మూర్ పట్టణంలోని సిటీ మున్నూరుకాపు కల్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హాజరుకానున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కాని నర్సింలు
సుభాష్నగర్, మే 14: ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు నిర్వహించనున్నామని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్మూర్ పట్టణంలోని సిటీ మున్నూరుకాపు కల్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కాని నర్సింలు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్, రవీంద్రకుమార్గౌడ్, నందమూరి సుహాసిని, మాజీ ఎమ్మెల్యే కొత్తపేట దయాకర్, గోపాల్రెడ్డి, నన్నురి నర్సారెడ్డిలు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జిల్లాలో వరిధాన్యం త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. కాంటాలో రెండు కిలోల తరుగు తీస్తున్నారని వెంటనే తరుగును తీయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వినోద్కుమార్, ప్రతాప్రెడ్డి, కొయేడి నర్సింలు, అంబికా సత్యనారాయణ, లవంగ రాజు, శంకర్, రవి, నర్సయ్య, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.