టీడీపీ సభ్యత్వాల జోరుపెంచాలి: మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి
ABN , First Publish Date - 2022-08-10T05:07:57+05:30 IST
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు జోరు పెంచాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు.
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు జోరు పెంచాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావే శంలో ఆమె మాట్లాడారు. అన్ని గ్రామాలు, అన్ని వార్డుల్లో బాదుడే బాదుడే కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, శ్రీకాకుళం, గార మండలాల పార్టీ అధ్యక్షులు సీర రమణయ్య, లోపింటి రాధాకృష్ణరెడ్డి, క్లస్టర్స్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.