‘ప్రభుత్వ ధనం దోచుకుంటున్న మంత్రి’

ABN , First Publish Date - 2022-05-25T05:48:29+05:30 IST

జగ్గన్నపేటలోని ప్రభుత్వ స్థలాన్ని మట్టి మాఫియాతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్య నారాయణ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి ఆరోపించారు.

‘ప్రభుత్వ ధనం దోచుకుంటున్న మంత్రి’
మట్టి మైనింగ్‌ ప్రాంతం పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు

తాడేపల్లిగూడెం అర్బన్‌ / రూరల్‌, మే 24: జగ్గన్నపేటలోని ప్రభుత్వ స్థలాన్ని మట్టి మాఫియాతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్య నారాయణ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి ఆరోపించారు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్న పేట వద్ద  తవ్వుతున్న చెరువును ఆయన టీడీపీ నాయకులతో కలిసి మంగ ళవారం పరిశీలించారు. విజిలెన్స్‌ అధికారులను సైతం నియంత్రించిన వారిపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా దండగర్ర చెరువు ఇదే మాదిరిగా తవ్వకాలు చేపట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నార న్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో రహదారులకు కంకరను ఉపయోగించాలని తీర్మానం చేసి బయటకు తరలిస్తున్నారన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు ముత్యాల సత్యనారాయణ, కిల పర్తి వెంకట్రావు, పాల శ్రీను, గంధం సతీష్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-25T05:48:29+05:30 IST