మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-06-26T06:00:23+05:30 IST
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా మునిసిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని టీఎన్టీ యూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకన సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.
నరసాపురం టౌన్, జూన్ 25: ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా మునిసిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని టీఎన్టీ యూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకన సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అధికారం చేపట్టి మూడేళ్లైనా జగన్ ప్రభుత్వం మునిసిపల్ కార్మికుల సమస్యలపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. కార్మికులు చేపట్టే ఆందోళనకు టీడీపీకి అండగా ఉంటుందన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన హెల్త్ అలవెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ, వారంలో ఒక రోజు సెలవు, ప్రమాదంలో మరణించిన వారికి సాయం, ఉద్యోగం, కరోనా సమయంలో చెల్లించాల్సిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొప్పాడి నరేష్, చెన్నూరి శ్రీనివాస్, బండి లక్ష్మణరావు, బి.సత్తిబాబు, సంకు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.