ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
ABN , First Publish Date - 2021-01-27T06:27:00+05:30 IST
ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించుకుందామని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు.
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), జనవరి 26: ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించుకుందామని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడటం ఆనందించదగ్గ విషయ మన్నారు. వనమాడి ఆధ్వర్యంలో మంగళవారం రాజ్యాంగ పరిరక్షణ దినం నిర్వహించారు. ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.