వైసీపీ పాలనలో ఎవరికీ రక్షణ లేదు

ABN , First Publish Date - 2022-05-24T05:41:06+05:30 IST

వైసీపీ పాలనలో ఏఒక్కరికి రక్షణ లేదని నియోజ కవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పొత్తూరి రామరాజు అన్నారు.

వైసీపీ పాలనలో ఎవరికీ రక్షణ లేదు
కోమటితిప్పలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు

టీడీపీ నేతల విమర్శ


మొగల్తూరు, మే 23: వైసీపీ పాలనలో ఏఒక్కరికి రక్షణ లేదని నియోజ కవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పొత్తూరి రామరాజు అన్నారు. కోమటితిప్ప, నీటితిప్ప గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నవరత్న పథకాల పంపిణీలో కోత విధి స్తున్నారని, నిత్యం మహిళలపై దాడులు, అత్యాచారాలు, వైసీపీ మద్దతుగా ఉన్న దళితులపైనా దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్‌, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. వైసీపీ పాలన వైఫల్యాల పై ఆయన ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షు డు గుబ్బల నాగరాజు, కత్తిమండ ముత్యాలరావు, బస్వాని ఏడుకొండలు, జోగి పండు, మామిడిశెట్టి సత్యనారాయణ, తిరుమాని చక్రవర్తి, పొత్తూరి శ్రీనివాసరాజు, కొపనాతి మహలక్ష్మణరావు, బండి, సుందర సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


బాదుడు తప్పాలంటే టీడీపీ రావాలి

ఇరగవరం: ధరల బాదుడు తప్పాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని టీడీపీ మండల అధ్యక్షుడు గోపిశెట్టి రామకృష్ణ అన్నారు. అర్జునుడుపాలెంలో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. ప్రజలకు కరపత్రాలు అందజేసి చంద్రబాబును సీఎం చేయాలని కో రారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు చుక్కా సాయిబాబు, నాయకులు బొంతు శ్రీను, కొల్లి అప్పారావు, వేండ్ర జనార్దన్‌, మల్లిపూడి త్రిమూర్తులు, సాధనాల సత్యనారాయణ, కొప్పునూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:41:06+05:30 IST