టీడీపీ నాయకుల నిరాహార దీక్ష
ABN , First Publish Date - 2021-01-27T05:50:55+05:30 IST
టీఎన్ఎస్ఎఫ్ నాయకుల అరెస్టుకు నిరసనగా నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్ఎస్ఎఫ్, టీఎన్టీయూసీ నాయకులు, సభ్యులు నిరాహరదీక్ష చేపట్టారు.
మహారాణిపేట, జనవరి 26: టీఎన్ఎస్ఎఫ్ నాయకుల అరెస్టుకు నిరసనగా నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్ఎస్ఎఫ్, టీఎన్టీయూసీ నాయకులు, సభ్యులు నిరాహరదీక్ష చేపట్టారు. పీజీ విద్యకు ఫీజ్ రీయింబర్స్మెంట్ను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-77ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 22న సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేయడం సమంజసం కాదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అరెస్టు అయిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మంగళవారం జైల్లో నిరహరాదీక్ష చేపట్టడంతో వారికి మద్దతుగా టీడీపీ నాయకులు నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్ష్యరాలు వి.అనిత, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్ష్యడు పల్లా శ్రీనివాసరావు, తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.