కౌన్సిలర్‌ కరుణాకర్‌రాజు మృతి

ABN , First Publish Date - 2021-05-17T05:07:27+05:30 IST

గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, కౌన్సిలర్‌ బొజుగు కరుణాకర్‌రాజు (52) అనారోగ్యంతో మృతి చెందారు.

కౌన్సిలర్‌ కరుణాకర్‌రాజు మృతి

గూడూరు, మే 16: గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ  సీనియర్‌ నాయకుడు, కౌన్సిలర్‌ బొజుగు కరుణాకర్‌రాజు (52) అనారోగ్యంతో మృతి చెందారు. కరుణాకర రాజు కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా, మెరువైన వైద్యం కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. చికిత్స పొంది కోలుకున్న కరుణాకర రాజు శనివారం గూడూరులోని తన స్వగృహానికి చేరుకున్నారు. అయితే ఆదివారం అస్వస్థతకు గురై కరుణాకర్‌రాజు మృతి చెందారు. టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డి గూడూరు చేరుకుని కరుణాకర్‌రాజు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. గూడూరు నగర పంచాయితీ ఎన్నికల్లో స్వతంత్ర 2వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటు అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు సురేష్‌, నగర పంచాయతీ మాజీ వైస్‌ చైర్మన్‌ రామాంజనేయులు, పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.


Updated Date - 2021-05-17T05:07:27+05:30 IST