వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: టీడీపీ నేత

ABN , First Publish Date - 2021-10-08T18:12:14+05:30 IST

వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కర్నూలు పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: టీడీపీ నేత

కర్నూలు: వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు.. అన్యమత ప్రచారాలు పెరిగాయన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వైసీపీ రంగుల లైట్లు వేశారని మండిపడ్డారు. దేవుళ్లపైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో హిందూ సంస్కృతిపైన ఇంత దాడి జరుగుతున్నా బీజేపీ సైలెంట్‌గా ఉండటానికి కారణం ఏంటో చెప్పాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. 

Updated Date - 2021-10-08T18:12:14+05:30 IST