ఏ2 ఎంపీ నీకు విశాఖలో ఏం పని?: విజయ్

ABN , First Publish Date - 2021-06-12T19:32:56+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ఒక నకిలీ పార్టీ అని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఏ2 ఎంపీ నీకు విశాఖలో ఏం పని?: విజయ్

విశాఖపట్నం: రాష్ట్రంలో  వైసీపీ ఒక నకిలీ పార్టీ అని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి సున్నా...ఉద్యగ కల్పనలో సున్నా అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అబివృద్ధి జరిగిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాడులు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప ఇంకా ఏమీ చేయాలేదన్నారు. రెండేళ్లలో ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఏ2 ఎంపీ నీకు విశాఖ లో ఏమి పని... ప్రభుత్వం కార్యాలయాలను తాకట్టు పెడతారా.....నగరంలో ఎక్కడ భూములు కనపడితే అక్కడ కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల తాకట్టు నిర్ణయం వెనక్కు తీసుకో’’ అంటూ విజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2021-06-12T19:32:56+05:30 IST