చవితి ఉత్సవాలపై సీఎం జగన్కు నిమ్మల బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2021-09-07T19:32:43+05:30 IST
వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సీఎం జగన్కు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బహిరంగ లేఖ రాశారు.
ఏలూరు: వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సీఎం జగన్కు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బహిరంగ లేఖ రాశారు. మన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను నిషేధించడం భక్తుల మనోభావాలకు విరుద్ధమన్నారు. గణేష్ ఉత్సవాలను పొరుగు రాష్ట్రం తెలంగాణలో రద్దు చేయలేదని తెలిపారు. కరోనా సాకుతో మన రాష్ట్రంలోనే రద్దు చేయడం దారుణమన్నారు. గణేష్ ఉత్సవాలకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని నిమ్మల రామానాయుడు లేఖలో పేర్కొన్నారు.