వైసీపీ పాలనలో సంక్రాంతి పండగ చేసుకోలేని స్థితి: నజీర్

ABN , First Publish Date - 2022-01-12T17:46:24+05:30 IST

వైసీపీ పాలనలో ప్రజలు సంక్రాంతి పండగను చేసుకునే పరిస్థితి లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు.

వైసీపీ పాలనలో సంక్రాంతి పండగ చేసుకోలేని స్థితి: నజీర్

విశాఖపట్నం: వైసీపీ పాలనలో ప్రజలు సంక్రాంతి పండగను చేసుకునే పరిస్థితి లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పేద ప్రజలకు సంక్రాంతి కానుక ఇచ్చేవారని గుర్తుచేశారు. అలాగే, ముస్లిం, క్రిస్మస్ పండగ సందర్భంగా ఎన్నో కానుకలను చంద్రబాబు ఇచ్చేవారన్నారు. కానుకలు మాట అలా ఉంచితే... పన్ను రూపంలో వైసీపీ సర్కార్ వాతలు పెడుతున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై జగన్ పెను భారం వేశారని నజీర్ విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-01-12T17:46:24+05:30 IST