తుగ్లక్ సీఎంను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైంది: Nakka Anantd
ABN , First Publish Date - 2021-12-16T19:23:53+05:30 IST
5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.
గుంటూరు: 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. ప్రతిపక్ష నేతగా అమరావతి అంగీకారం తెలిపి అధికారంలోకి వచ్చి మాట మార్చారని, అమరావతిపై కుల ముద్ర వేసి నాశనం చేశారని మండిపడ్డారు. రాజధానికి భూములు ఇచ్చిన వారిలో ఎస్సీ , ఎస్టీలే అధికంగా ఉన్నారని తెలిపారు. అమరావతి అభివృద్ధి చెందితే ఎస్సీ, ఎస్టీలు బాగుపడతారని జగన్కు ఈర్ష్య అని వ్యాఖ్యానించారు. తుగ్లక్ సీఎంను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మాజీ సీఎం రోశయ్య చనిపోతే కనీసం నివాళ్లు అర్పించలేదన్నారు. రోశయ్యను సీఎంగా ఉన్నప్పుడు ఎలాగూ బాధపెట్టిన జగన్ చనిపోయిన తర్వాత కూడా కక్ష్య ఎందుకు అని ప్రశ్నించారు. వేమూరులో ప్రభుత్వం తరుపున రోశయ్య కాంస్య విగ్రహం పెట్టాలని, ప్రభుత్వం స్పందించకపోతే తామే ఏర్పాటు చేస్తామని నక్కా ఆనంద బాబు స్పష్టం చేశారు.